Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంటల్లో కాలిపోయిన ఆర్టీసీ బస్సు.. 50 మంది ప్రయాణికుల సురక్షితం

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (09:51 IST)
విశాఖపట్టణంలో ఓ ఆర్టీసీ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఇందులో ప్రయాణిస్తూ వచ్చిన దాదాపు 50 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదం విశాఖ జిల్లా పరవాడ మండలం, వాడచీపురుపల్లికి సమీపంలోని జ్ఞానాపురం వంతెన వద్ద జరిగింది. 
 
వాడచీపురుపల్లి నుంచి 50 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు ఒకటి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు బయలుదేరింది. జ్ఞానాపురం కాన్వెంట్ కూడలి వంతెనపైకి రాగానే బస్సు వెనుక చక్రం నుంచి పొగలు వచ్చాయి. 
 
దీన్ని గమనించిన బస్సు కండక్టర్ ఈ విషయాన్ని డ్రైవర్‌కు చేరవేశాడు. వెంటనే బస్సును ఆపేసి, అందులోని ప్రయాణికులందరినీ కిందకు దించేశాడు. ఆ తర్వాత పోలీసులకు, అగ్నిమాపకదళ సిబ్బందికి సమాచారం చేరవేశాడు. 
 
అయితే, బస్సులో నుంచి ప్రయాణికులు దిగిన కొన్ని క్షణాల్లోనే మంటలు బస్సును చుట్టుముట్టాయి. ఆ సమయంలో అటుగా గ్యాస్ సిలిండర్ల లారీ రావడంతో అక్కడే ఉన్న హోం గార్డులు ఆ లారీని దూరంగా నిలిపివేశారు. 
 
ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే బస్సుకు నలువైపులా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే, ఈ బస్సు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments