Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భాగ్యనగరికి రానున్న హోం మంత్రి అమిత్ షా - రెండు రోజుల బస

amith shah
, మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (19:58 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 16వ తేదీన హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఈ పర్యటనలో ఆయన రెండు రోజుల పాటు నగరంలో బస చేయనున్నారు. ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబరు 17వ తేదీన జరిగే తెలంగాణ విమోచన దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈ వేడుకకు కేంద్ర ప్రభుత్వం తరపున అమిత్ షా హాజరవుతున్నారు. ఈ వేడుకలను కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ వేడుకలకు కేంద్ర ప్రభుత్వం తరపున అమిత్ షా హాజరుకానున్నారు. 
 
16వ తేదీన భాగ్యనగరికి చేరుకునే ఆయన ఆ రాత్రికి నగరంలో బస చేస్తారు. 17వ తేదీన విమోచన దినోత్సవం వేడుకలో పాల్గొంటారు. ఆ తర్వాత నగర బీజేపీ శాఖకు చెందిన పలువురు ప్రతినిధులతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్టతపై దృష్టిసారించిన అమిత్ షా.. నగర శాఖ ప్రతినిధులతోనూ ఇదే విషయంపై కీలక సలహాలు, సూచనలు ఇస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. ఢిల్లీ కస్టమర్ షాకయ్యాడు.. ఏం జరిగింది..