Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్టీఆర్‌ను అమిత్‌ షా కలవగానే చంద్రబాబుకు వణుకు పుట్టింది...

rk roja
, శుక్రవారం, 26 ఆగస్టు 2022 (17:56 IST)
వైకాపా నేత, మంత్రి ఆర్కే రోజా పశ్చిమగోదావరిలోని రాజమండ్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు పిచ్చి ఆసుపత్రిలో చేరే రోజులు దగ్గరపడ్డాయన్నారు. 
 
మొన్నటి వరకు ఓ ఫేక్‌ వీడియోతో చంద్రబాబు నాటకాలు ఆడారు. నిన్న కుప్పంలో మరో నాటకానికి తెరలేపారు. సీఎం ఏం చేసినా రాద్దాంతం చేయాలని బాబు చూస్తున్నారు. చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా నమ్మడం లేదని చెప్పారు.
 
కుప్పంలో తన కోట కూలిపోతోందని బాబు భయపడుతున్నారు. ఎప్పుడైతే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిసి మాట్లాడారో.. అప్పటి నుంచి చంద్రబాబులో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్కూలు వ్యానును ఢీకొన్న కాలేజీ బస్సు.. వేర్వేరు ప్రాంతాల్లో..?