Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతకు తెలంగాణ గవర్నర్ వార్నింగ్..ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (08:55 IST)
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ యువతకు హెచ్చరికలు జారీ చేశారు. జాగ్రత్త వహించకుంటే ముప్పు తప్పదన్నారు. కరోనా ఎవరికైనా వస్తుందని తెలిపారు.

45 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్లు కూడా కరోనా బారినపడుతున్నారని తెలిపారు. 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లోనూ, పురుషుల్లోనూ కరోనా పాజిటివ్ కేసుల శాతంలో పెరుగుదల కనిపిస్తోందని వెల్లడించారు.

'మేం యువత. కరోనా మాకెందుకు వస్తుందిలే అనుకోవద్దు. కరోనా ఎవరికైనా వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలను పాటించాలి. కరోనా సోకగానే వీలైనంత తొందరగా వైద్యులను సంప్రదించాలి' అని తమిళిసై స్పష్టం చేశారు. 
 
కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో... 60 ఏళ్లు పైబడినవారు జాగ్రత్తగా ఉండాలని, యువతకు వ్యాధి నిరోధక శక్తి మెండుగా ఉండడంతో వారికి ఈ వైరస్ సోకే అవకాశాలు తక్కువని ప్రచారం జరిగింది.

అయితే, ఇటీవల వస్తున్న నివేదికల్లో యువతలోనే కరోనా పాజిటివ్ కేసులు అధికంగా వస్తున్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments