Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డిమాండ్ ఉన్న కోర్సుల్లో యువతకు శిక్షణ : ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ

డిమాండ్ ఉన్న కోర్సుల్లో యువతకు శిక్షణ : ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ
, శుక్రవారం, 7 ఆగస్టు 2020 (16:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి), ఐడిఎస్ ఇన్కార్పొరేషన్ ఆధ్వర్యంలో క్లౌడ్ ఆర్కిటెక్ట్, బ్లాక్ చైన్ టెక్నాలజీపై ఆన్ లైన్ శిక్షణ ఇస్తున్నట్టు ఆసంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి,  ఎండి, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు.

లింక్డిన్ రీసెర్చ్ ప్రకారం మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ మొదటి స్థానం, క్లౌడ్ ఆర్కిటెక్ట్ రెండో స్థానంలో ఉన్నాయని.. ఇలాంటి డిమాండ్ ఉన్న కోర్సుల్లో మన యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మరింత సులువుగా పొందే అవకాశం ఉంటుందన్నారు.

ఈ ఉద్దేశ్యంతోనే ఎపిఎస్‌ఎస్‌డిసి అమెజాన్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ ప్రోగ్రామ్, బ్లాక్ చైన్ టెక్నాలజీపై ఈనెల 10వ తేదీ నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభిస్తోందని వారు తెలిపారు. అమెజాన్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ ప్రోగ్రామ్ 36 గంటలు, బ్లాక్ చైన్ టెక్నాలజీపై 40ల గంటలపాటు ఆన్ లైన్ శిక్షణ ఇస్తారు.

క్లౌడ్ ఆర్కిటెక్ట్ ప్రోగ్రామ్ నేర్చుకునేందుకు సీఎస్ఈ, ఐటి, ఈసీఈలో ఎంటెక్, బీటెక్ పాసైనవారు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక బ్లాక్ చైన్ టెక్నాలజీ లో ఆన్ లైన్ శిక్షణ కోసం సీ.ఎస్.ఈ, ఐ.టి విభాగంలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన వారు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు అర్హులు.

ఆసక్తి ఉన్నవారు ఈనెల 9వ తేదీ సాయంత్రంలోపు www.apssdc.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ప్రొఫెసర్ డి.వి.రామకోటి రెడ్డి తెలిపారు. ఈనెల 10వ తేదీ నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభమవుతాయి. మరిన్ని వివరాలకు ఎపిఎస్‌ఎస్‌డిసి టోల్ ఫ్రీ నంబర్ 18004252422కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కామారెడ్డికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శరణ్య అనుమానాస్పద మృతి, కానీ ప్రేమ పెళ్లి