తెలంగాణలో అరుదైన మూషిక శిల్పం.. గణపతి దేవుడి కాలానికి..?

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (16:14 IST)
తెలంగాణలో అరుదైన మూషిక శిల్పం బయటపడింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మండలం జనగాంలోని శిథిలంగా మారిన శివాలయం వద్ద ఈ విగ్రహం బయల్పడింది. ఈ శివాలయం 800 ఏళ్ల నాటిది. 
 
ఈ విగ్రహానికి సంబంధించి పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ, కాకతీయుల కాలం నాటి త్రిలింగ రాజరాజేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న త్రికూటాలయంలో తుప్పలు, పొదలు తొలగిస్తుండగా గణపతి వాహనం వెలుగుచూసిందని చెప్పారు.
 
ఈ శిల్పం 3 అడుగుల పొడవు, రెండున్నర అడుగుల ఎత్తు ఉందని శివనాగిరెడ్డి తెలిపారు. తెలంగాణలో ఇదే అతిపెద్ద మూషిక విగ్రహమని చెప్పారు. సర్వాభరణాలతో అలంకరించినట్టున్న ఈ శిల్పం గణపతిదేవుడి కాలానికి చెందినదని తెలిపారు. 
 
త్రికూటాలయంలో రెండు ఆలయాల్లో శివలింగాలు ఉన్నాయని. మూడో ఆలయం వినాయకుడిది అయిఉండొచ్చని చెప్పారు. గుప్తనిధుల కోసం ఈ విగ్రహాన్ని పెకిలించి ఉండొచ్చని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments