Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో సీఎం కేసీఆర్ పర్యటన: ఎం.కె.స్టాలిన్‌తో భేటీ

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (12:15 IST)
తమిళనాడులో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. డిసెంబర్ 13వ తేదీ ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. ముందుగా శ్రీరంగంలోని రంగనాథ ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. 
 
అనంతరం తిరుగు ప్రయాణంలో చెన్నైకి చేరుకుని అక్కడే బస చేస్తారని, డిసెంబర్ 14వ తేదీ మంగళవారం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌తో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవానికి సీఎం స్టాలిన్‌ను ఆహ్వానించనున్నారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు. 
 
అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తమిళనాడు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 2010, మే 13వ తేదీన సీఎం కేసీఆర్ శ్రీరంగం వెళ్లి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎం కేసీఆర్ ఎండగడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments