Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెదక్ జిల్లాల్లో విషాదం : సీఎంకు లేఖ రాసి రైతు ఆత్మహత్య

మెదక్ జిల్లాల్లో విషాదం : సీఎంకు లేఖ రాసి రైతు ఆత్మహత్య
, శుక్రవారం, 10 డిశెంబరు 2021 (14:30 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాల్లో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకునేముందు ముఖ్యమంత్రికి లేఖ రాసిమరీ చనిపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మెదక్ జిల్లాలోని హవేలి ఘన‌పూర్ మండలంలోని బొగడ భూపతిపూర్ గ్రామంలో ఓ యువరైతు ఉన్నాడు. ఈయన కుమారుడు అనారోగ్యంబారినపడ్డాడు. అతనికి వైద్యం చేయించేందుకు డబ్బులు లేవు. 
 
పైగా, ఆసరా పెన్షన్‌కు అర్హుడైన తన తండ్రికి పెన్షన్ రావడం లేదు. దీనికితోడు పండించిన వరి ధాన్యానికి సరైన గిట్టుబాటు ధరలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకునిపోయాడు. 
 
ఈ సమస్యల నుంచి గట్టెక్కాలంటే ఆత్మహత్యే శరణ్యమని భావించిన ఆ రైతు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసి తన జేబులో పెట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనవసర ఊహాగానాలు వద్దు.. హెలికాఫ్టర్ ప్రమాదంపై ఐఏఎఫ్ ట్వీట్