Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈటలను హగ్ చేసుకున్న తెరాస ఎంపి, కేసీఆర్ షాక్ తిన్నారా? (video)

ఈటలను హగ్ చేసుకున్న తెరాస ఎంపి, కేసీఆర్ షాక్ తిన్నారా? (video)
, సోమవారం, 13 డిశెంబరు 2021 (12:51 IST)
తెరాస సీనియర్ నాయకుడు, ఎంపీ కె. కేశవరావు చేసిన పనికి ముఖ్యమంత్రి కేసీఆర్ షాక్ తిన్నారట. సీఎం షాక్ తినే పని ఏం జరిగింది అని అనుకుంటున్నారా?

 
ఈటెలను కేకే ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈటెల అంటేనే సీఎం కేసీఆర్ భగ్గుమంటున్నారు. ఈ తరుణంలో కెకె ఇలా చేయడంతో పార్టీ శ్రేణులు అవాక్కయ్యాయి. ఇంతకీ ఈ ఆలింగనం ఎక్కడ జరిగింది అంటే... హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడి వివాహం ఆదివారం జరిగింది.

 
ఈ వేడుకకు కెకె, ఈటెల హాజరయ్యారు. ఇద్దరూ ఎదురెదురు పడటంతో కేకే భాజపా ఎమ్మెల్యే ఈటెలను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇపుడిదీ హాట్ టాపిక్ అయ్యింది. తెరాసలో మంత్రిగా పనిచేసి ఆ తర్వాత పార్టీని వదిలి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరిన ఈటెల తెరాస ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. అలాంటి నాయకుడితో కేకే ఇలా వుండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పలువురు నేతలు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్బీఐ నిరుద్యోగులకు శుభవార్త: 1100 పోస్టులు ఖాళీ