తెలంగాణలో కొవిడ్‌ తగ్గుముఖం, గత 18 రోజుల్లో 4 శాతానికి పైగా దిగువకు

Webdunia
బుధవారం, 19 మే 2021 (18:07 IST)
రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ నివేదిక విడుదల చేసింది. ఈ నెల 1 నుంచి 18 వరకు కరోనా వైరస్‌ పాజిటివిటీ రేటు 4.17 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. గడిచిన 18 రోజుల్లో కోలుకున్నవారి శాతం 81.57 నుంచి 90.48 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించింది.
 
* ఈ నెలలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిన విధానాన్ని కూడా వైద్య, ఆరోగ్య శాఖ ఆ నివేదికలో వివరించింది. ఈనెల 1న 7,430 కొత్త కేసులు నమోదైతే.. 18న 3,982 కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.
 
* మార్చి 1న 9.73 శాతం పాజిటివ్‌ రేటు నమోదవగా.. ఈ నెల 18న 5.56 శాతానికి తగ్గింది.
 
* ఇందులోనూ తొలివారం గడిచేసరికి 8.69 శాతానికి తగ్గగా రెండోవారం ముగిసే సరికి 7.22 శాతానికి తగ్గుముఖం పట్టింది.
 
* గతేడాది సెప్టెంబరు 3 నాటికి 42 ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స అందగా ప్రస్తుతం వాటి సంఖ్య 112కు పెరిగింది. ప్రభుత్వ వైద్యంలో పడకలు కూడా 8,052 నుంచి 15,297కు పెరిగాయి. అలాగే గత సెప్టెంబరు 3 నాటికి 194 ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్స అందగా.. ప్రస్తుతం 1,153 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ చికిత్స చేస్తున్నారు. ప్రైవేటులో పడకల సంఖ్యను కూడా 10,180 నుంచి 38,459కు పెంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments