Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం కేసీఆర్‌కు ఇప్పటికే జ్ఞానోదయమైంది : విజయశాంతి

సీఎం కేసీఆర్‌కు ఇప్పటికే జ్ఞానోదయమైంది : విజయశాంతి
, బుధవారం, 19 మే 2021 (10:04 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ మహిళా నేత, సినీ నటి విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం కేసీఆర్‌కు ఇప్పటికే జ్ఞానోదయమైందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్‌లో చేరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడాన్ని ఆమె స్వాగతించారు. 
 
సీఎంగారికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగించిన ఆ దైవానికి కృతజ్ఞతలు అంటూ వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌లపై బీజేపీ ఒత్తిళ్లకు కేసీఆర్ దిగొచ్చారన్నారు. అయితే, గత 15 నెలల కాలంలో కరోనాతో బాధపడి ఆసుపత్రి బిల్లులు చెల్లించిన ప్రతి ఒక్కరికీ ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రీయింబర్స్‌మెంట్ చేస్తుందన్న నిర్ణయాన్ని కూడా కేసీఆర్ ప్రకటించాలని విజయశాంతి డిమాండ్ చేశారు.
 
ఓవైపు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, జల ప్రాజెక్టుల కమిషన్లు ఉండగానే... టీఆర్ఎస్ దొరల అనుచర బంధుగణం మెడికల్ మాఫియా అవతారం ఎత్తిందని విమర్శించారు. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ తోపాటు కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్లను కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని విజయశాంతి మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యదరా సముద్రంలో పెను విషాదం.. పడవ మునిగి 57 జలసమాధి