గాంధీకి కేసీఆర్, రేవంత్ డిమాండ్లు, ఏంటవి?

Webdunia
బుధవారం, 19 మే 2021 (17:59 IST)
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా కొన్ని డిమాండ్లు చేశారు. కరోనా సేవలో ఉన్న నాలుగవ తరగతి ఉద్యోగుల జీతాలు రూ.8 వేల నుంచి రూ.16 వేలకు పెంచాలన్నారు. వైద్యులు, సిబ్బందికి గతంలో ఇస్తానన్న 10 శాతం ఇన్సెంటివ్‌ను ఇంతవరకు అతీగతీ లేదని విమర్శించారు. ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

జూడాలతో ఆసుపత్రి వేదికగా చర్చలు జరిపి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. గాంధీలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై టైం టార్గెట్ పెట్టుకుని పరిష్కరించాలని రేవంత్‌ అన్నారు. కోవిడ్‌తో చనిపోయిన రోగుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

గతంలో ఉస్మానియాకు వెళ్లిన కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపించారని వ్యాఖ్యానించారు. ఆ హామీలు ఇప్పటికీ నెరవేరలేదని మండిపడ్డారు. నేటి గాంధీ పర్యటన మరో ఉస్మానియా పర్యటన కాకూడదని రేవంత్‌రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments