ఈ హల్వా టేస్ట్ చేస్తే మళ్లీమళ్లీ కావాలంటారు...

Webdunia
ఆదివారం, 23 ఆగస్టు 2020 (20:21 IST)
కరోనావైరస్ దెబ్బకు స్వీట్ షాపుల్లో ఏమయినా కొనాలంటే భయం కలుగుతోంది. ఆ పదార్థాల ద్వారా వైరస్ వస్తుందేమోనన్న జంకు చాలామందిలో వుంటుంది. ఐతే పిల్లలు మాత్రం చిరుతిళ్లు కోసం ఆరాటపడుతుంటారు. కనుక ఈ క్రింది రెసిపీ ట్రై చేసి చూడండి
 
కావలసిన పదార్థాలు: 
బియ్యం పిండి: 250 గ్రాములు
పంచదార: పావు కిలో 
మిక్సిడ్ డ్రై ఫ్రూట్స్: 150 గ్రాములు 
జీడిపప్పు: 50 గ్రాములు 
పాలు: ఒక కప్పు 
యాలకుల పొడి: ఒక టీ స్పూన్ 
రోజ్ వాటర్: రెండు టేబుల్ స్పూన్లు 
 
ఇలా చేయండి:
మందపాటి అడుగుతో కూడిన పాన్‌ను తీసుకుని అందులో పాలతో కలిపిన బియ్యం పిండి మిశ్రమాన్ని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. అందులో పంచదార చేర్చి పిండి ఉడికింతేవరకు తక్కువ మంటమీద కలుపుతూ ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టౌ నుంచి దించి పక్కన పెట్టుకోండి. విడిగా ఓ పాత్రలో అరకప్ పంచదార, అరకప్పు నీటితో చిక్కని పాకం రానివ్వాలి. ఈ పాకంలో రోజ్‌వాటర్, తరిగిన డ్రైఫ్రూట్స్‌ను కలిపి ఉడికించిన బియ్యం పిండి మిశ్రమంలో కలిపాలి. తర్వాత నేతితో వేయించిన జీడిపప్పును వేసి అలంకరించి సర్వ్ చేయొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మద్యం సేవించి ఇంటికొచ్చి గొడవ... భర్తను చున్నీతో చంపేసిన భార్య .. ఎక్కడ?

కాంతి రేఖలా ఇండియా పాకిస్థాన్ సరిహద్దు.. వీడియోను షేర్ చేసిన ఇండిగో పైలెట్ (వీడియో)

కోవైలో పదేళ్ల బాలిక చనిపోతే.. ప్రెస్‌మీట్‌లో నవ్వుతూ బదులిస్తారా? విజయ్ సీరియస్ (video)

తెలంగాణాలో బెంబేలెత్తిస్తున్న ఎండలు.. ఒక్కరోజే 42 మంది మృత్యువాత

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments