Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరివెన్నెల వాన పాట... వినాల్సిందే (Video)

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (16:08 IST)
సినీ గేయ రచయితల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రికి ప్రత్యేక స్థానం ఉంది. ఆక్రోశం, ఆవేదన, ప్రేమ, విరహం, హాస్యం ఇలా వివిధ నేపథ్యాలకు పాటలు వ్రాసి, తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గేయరచయితల్లో శాస్త్రి గారు గుర్తుండిపోతారు. తెలుగు పాటలు కరువైపోతున్న కాలంలో కూడా తన కలంతో తెలుగు భాషకు పట్టాభిషేకం చేస్తున్న శాస్త్రి గారు రచించిన పాటలు చాలా మందికి స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. 
 
శాస్త్రి గారు చేస్తున్న కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. కాస్త ఆలస్యం అయినప్పటికీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. శ్రాస్త్రి గారు రచించిన పాటలలో ఇప్పుడు మనం ఒక పాటను గుర్తు చేసుకుందాం.
 
తరాలు మారినా, యుగాలు మారినా, హీరోలు మారినా, హీరోయిన్‌లు మారినా భాష మాత్రం అలాగే ఉంటుందని చెప్పేందుకు నిదర్శనంగా ఉండే ఒక మధుర గీతం - చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా అనే పాట అమ్మాయి యొక్క మనస్థత్వాన్ని సినిమాలో కళ్లకు కట్టినట్టు ఆవిష్కృతం చేసారు శాస్త్రి గారు. 
 
ఇందులో నటించిన ఉదయకిరణ్, ఆర్తీ అగర్వాల్, సుజాత ప్రస్తుతం భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి నటన మనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. స్వచ్ఛమైన తెలుగు పదాలతో రాసిన ఆ గీతం ఆ సంవత్సరం నంది అవార్డుల్లో ఉత్తమ గాయని అవార్డును తెచ్చిపెట్టింది. ఆ పాటను మీరు కూడా ఓసారి చూడండి.. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments