Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభలగ్నం సీక్వెల్.. మళ్లీ జగపతిబాబు హీరోగా, ఆమని, రోజా హీరోయిన్లుగా నటిస్తారా?

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (16:01 IST)
ఒకప్పటి హీరో, ప్రస్తుత విలక్షణ నటుడు జగపతిబాబు నటించిన శుభలగ్నం సినిమాకు సీక్వెల్ రానుంది. జగపతిబాబు కెరీర్‌లో శుభలగ్నం సినిమా ఆయనకు మంచి గుర్తింపును సంపాదించిపెట్టింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1994లో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది. ఇందులో రోజా, ఆమని హీరోయిన్లుగా నటించారు. 
 
ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. వైఎస్సార్ బయోపిక్ ''యాత్ర'' సినిమాను నిర్మించిన 70ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్మెంట్స్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు కొత్త డైరక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు. భర్తను డబ్బుకోసం అమ్ముకునే పాత్రలో ఆమని కనిపించిన సంగతి తెలిసిందే. ఆమని భర్త అయిన జగపతిబాబును కోటి రూపాయలకు రోజా కొనుగోలు చేస్తుంది. 
 
ఈ సినిమా అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. అదే చిత్రానికి 25ఏళ్ల తర్వాత ప్రస్తుతం సీక్వెల్ రానుంది. తెలుగులో తెరకెక్కిన ఈ సినిమా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రీమేక్ అయ్యింది. తాజాగా హీరో హోదా నుంచి విలన్‌గా మారి భారీ పారితోషికం పుచ్చుకుంటున్న జగపతి బాబు ప్రధాన పాత్రధారిగా కనిపించనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments