శుభలగ్నం సీక్వెల్.. మళ్లీ జగపతిబాబు హీరోగా, ఆమని, రోజా హీరోయిన్లుగా నటిస్తారా?

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (16:01 IST)
ఒకప్పటి హీరో, ప్రస్తుత విలక్షణ నటుడు జగపతిబాబు నటించిన శుభలగ్నం సినిమాకు సీక్వెల్ రానుంది. జగపతిబాబు కెరీర్‌లో శుభలగ్నం సినిమా ఆయనకు మంచి గుర్తింపును సంపాదించిపెట్టింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1994లో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది. ఇందులో రోజా, ఆమని హీరోయిన్లుగా నటించారు. 
 
ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. వైఎస్సార్ బయోపిక్ ''యాత్ర'' సినిమాను నిర్మించిన 70ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్మెంట్స్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు కొత్త డైరక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు. భర్తను డబ్బుకోసం అమ్ముకునే పాత్రలో ఆమని కనిపించిన సంగతి తెలిసిందే. ఆమని భర్త అయిన జగపతిబాబును కోటి రూపాయలకు రోజా కొనుగోలు చేస్తుంది. 
 
ఈ సినిమా అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. అదే చిత్రానికి 25ఏళ్ల తర్వాత ప్రస్తుతం సీక్వెల్ రానుంది. తెలుగులో తెరకెక్కిన ఈ సినిమా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రీమేక్ అయ్యింది. తాజాగా హీరో హోదా నుంచి విలన్‌గా మారి భారీ పారితోషికం పుచ్చుకుంటున్న జగపతి బాబు ప్రధాన పాత్రధారిగా కనిపించనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రఘు రామ కృష్ణంరాజు కస్టడీ కేసు.. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు

డ్యాన్సర్‌తో అశ్లీల నృత్యం చేసిన హోంగార్డు.. పిల్లలు, మహిళల ముందే...?

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments