Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో బాలికపై బలవంతంగా అత్యాచారం..

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (19:33 IST)
ప్రేమ పేరుతో ఓ బాలుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఉత్తరాఖంఢ్‌లో చోటుచేసుకుంది. లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించగా.. తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని పంత్‌నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన కిశోర్ అనే మైనర్ బాలుడు పొరుగున నివసించే మరో మైనర్ బాలికకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. తరువాత ఆమెపై బలవంతంగా లైంగికదాడికి పాల్పడి.. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. 
 
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక ఆగస్టు 23న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తరువాత విషయం గురించి తల్లిదండ్రులకు తెలుపడంతో బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.
 
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు మైనర్‌ను గురువారం అదుపులోకి తీసుకుని జువెనైల్ కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఇద్దరూ మైనర్లేనని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం