Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధురైలో సంపూర్ణ లాక్ డౌన్.. 705కి పెరిగిన కరోనా కేసులు

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (10:20 IST)
Madurai
తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. కాగా, చెన్నై సహా నాలుగు జిల్లాలతో పాటు మదురై జిల్లాలోను ఈ నెల 30వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఫలితంగా నిద్రపోని నగరంగా పేరు గాంచిన మీనాక్షి దేవి వెలసిన మధురైలో సంపూర్ణ లాక్ డౌన్ విధించింది. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో మదురైలో సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
 
రాష్ట్రంలో కరోనా వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తోంది. ప్రధానంగా చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూర్‌ జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడంతో ఈనెల 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా అధికంగా ఉన్న జిల్లాలో మదురై కూడా చేరింది. ఆదివారం ఒకేరోజు జిల్లాలో 68 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 705కు పెరిగింది. 
 
ఈ క్రమంలో మదురైలో కరోనా నిరోధక చర్యల్లో భాగంగా బుధవారం నుంచి దుకాణాలను ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే తెరచి ఉంచాలని వ్యాపార సంఘాలు నిర్ణయించారు. అదే సమయంలో దుకాణాల ముందు ప్రజలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని, అనవసరంగా బయటకు రావద్దని జిల్లా ఎస్పీ మణివన్నన్‌ విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments