Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిజ్రాపై మనసుపడిన కుర్రోడు.. పెద్దలను ఎదిరించి పెళ్లి.. చివరకు...

హిజ్రాపై మనసుపడిన కుర్రోడు.. పెద్దలను ఎదిరించి పెళ్లి.. చివరకు...
, ఆదివారం, 21 జూన్ 2020 (10:51 IST)
ఓ హిజ్రాపై ఓ యువకుడు మనసు పారేసుకున్నాడు. ఆమెతో కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకోసం పెద్దలను ఎదిరించి హిజ్రాను పెళ్లి చేసుకున్నాడు. కానీ, నెల రోజులు కూడా తిరగకముందే వారిద్దరూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్లారు ప్రాంతానికి చెందిన దిలీప్ (26) అనే యువకుడు నిరావీ ప్రాంతానికి చెందిన షివానీ (30) అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వారిద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెంచింది. ఫలితంగా వారిద్దరూ ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేనంతగా మారిపోయారు. దీంతో షివానీతో దిలీప్ కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నాడు. 
 
వీరిద్దరి వ్యవహారం దిలీప్ కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులంతా గట్టిగా మందలించారు. అయినప్పటికీ దిలీప్ మాత్రం షివానీనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పాడు. ఆ తర్వాత నెలరోజుల క్రితం ఇల్లువదిలిపెట్టి వెళ్లిన దిలీప్... కారైక్కాల్‌ ఒడుదురై ప్రాంతంలో షివానీతో కాపురంపెట్టాడు. 
 
ఇంతలా ప్రేమను పంచుకున్న ఇద్దరి మధ్య వేరుకాపురం పెట్టిన తర్వాత ఏమైందో ఏమో శనివారం ఇద్దరూ ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కరోనా దూకుడు : 4 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు