Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ముసుగు వేసుకోలేదనీ.. కాళ్లు పట్టుకుని కన్నబిడ్డను నేలకేసి కొట్టిన తండ్రి

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (18:49 IST)
భార్యాభర్తల మధ్య గొడవ ఓ చిన్నారి ప్రాణాలను తీసింది. భార్య ముసుగు ధరించలేదన్న కోపంతో మూడేళ్ల కన్నబిడ్డ కాళ్లు పట్టుకుని కసాయి తండ్రి నేలకేసి కొట్టి చంపేశాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాకు చెందిన ప్రదీప్ యాదవ్ అనే వ్యక్తితో మోనికా అనే యువతికి కొన్నేళ్ల కిందట వివాహమైంది. వీరికి మూడేళ్ల పాప ఉంది. పెళ్లి అయిన నాటి నుంచి ఆచారాల పేరిట ఆమెను ప్రదీప్ మానసికంగా వేధిస్తూ వచ్చాడు. ముఖానికి ముసుగు ధరించాలంటూ పదే పదే ఇబ్బంది పెట్టేవాడు. కానీ, భార్య మాత్ర భర్త మాటను పెడచెవిన పెట్టేది. 
 
ఈ నేపథ్యంలో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే మంగళవారం కూడా భార్యాభర్తల మధ్య ముసుగు విషయంలో గొడవ జరిగింది. ఆమె ముసుగు వేసుకోననేసరికి కోపంతో ఊగిపోయిన ప్రదీప్.. ఆమెపై చేయి చేసుకున్నాడు. తర్వాత ఆ కోపాన్ని కూతురిపై చూపుతూ, చిన్నారిని కొట్టాడు. భార్య చేతిలో ఉన్న పాపను లాక్కుని బయటకు విసిరేశాడు. 
 
దీంతో ఆ చిన్నారి తీవ్రగాయాలపాలై మరణించింది. ఈ విషయం బయటకు పొక్కకుండా తన కుటుంబంతో కలిసి ఆ చిన్నారి మృతదేహాన్ని ప్రదీప్ ఖననం చేశాడు. బుధవారం జరిగిన ఘటనపై బెహ్రార్ పోలీసులకు మోనిక ఫిర్యాదు చేసింది. కాగా ప్రస్తుతం నిందితుడు ప్రదీప్ పరారీలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments