Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో బీటెక్ విద్యార్థిని వల : ప్రాణాలు తీసుకున్న యువకుడు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (18:43 IST)
తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఓ బీటెక్ విద్యార్థిని ప్రేమ పేరుతో ఘరానా మోసానికి పాల్పడింది. ప్రేమ పేరుతో తన స్నేహితురాలి సోదరుడుకి వలవు వల వేసింది. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దుగ్గొండి మండలం లక్మిపురానికి చెందిన ఓ యువతి బీటెక్ చదువుతోంది. డబ్బులు సంపాదించాలనే ఆశతో తన స్నేహితురాలి అన్నకే వలేసింది. రాయపర్తి మండలం మొరిపిరాలకు చెందిన తన స్నేహితురాలి అన్నకు ఫోన్ చేసింది. 
 
ముగ్గురు వేర్వేరు యువతుల పేర్లతో యువకుడికి ఫోన్ కాల్స్ చేస్తూ ముగ్గులోకి దించింది. అనంతరం ఆ ముగ్గురిలో ఓ యువతి పురుగుల మందు తాగి చనిపోయిందని బెదిరించి డబ్బులు లాగేయత్నం చేసింది. దాంతో భయపడిన యువకుడు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. 
 
ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కిలాడీ యువతిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments