Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణేలో జీబీఎస్ పదో కేసు.. 21 ఏళ్ల యువతి కిరణ్ చికిత్స పొందుతూ మృతి

సెల్వి
బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (15:24 IST)
GBS Virus
పూణేలో గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (GBS) కారణంగా మరణించిన వారి సంఖ్య పదికి చేరింది. తాజాగా 21 ఏళ్ల యువతి కిరణ్ రాజేంద్ర దేశ్‌ముఖ్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కిరణ్‌కు మూడు వారాలకు పైగా జీబీఎస్‌తో పోరాడింది.
 
పూణే సంరక్షక మంత్రి అజిత్ పవార్ నియోజకవర్గం, స్వస్థలం అయిన బారామతిలో నివసించే కిరణ్, తన చదువు కోసం సింహగడ్ ప్రాంతంలోని బంధువులతో కలిసి ఉండగా, ఆమెకు ఈ వ్యాధి సోకింది. 
 
ఈ ప్రాంతంలో అనేక జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. కిరణ్‌ కూడా ఈ వ్యాధి బారిన పడింది. ప్రారంభంలో, ఆమెకు విరేచనాలు, బలహీనత వంటి లక్షణాలు కనిపించాయి. దీనితో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను బారామతికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు నిపుణులు పరీక్షలు నిర్వహించారు.
 
బారామతిలో చికిత్స పొందుతున్నప్పటికీ, ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. ఆమెకు ఉన్న లక్షణాల ఆధారంగా, వైద్యులు జీబీఎస్‌ని అనుమానించారు. తదుపరి చికిత్స కోసం ఆమెను పూణేలోని ఆసుపత్రిలో చేర్చమని ఆమె కుటుంబ సభ్యులకు సలహా ఇచ్చారు. కిరణ్‌ను జనవరి 27న ఆసుపత్రిలో చేర్చారు. కానీ ఆమె ఆరోగ్యం క్షీణించింది. చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మరణించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ డ్రాగన్ చిత్రం లేటెస్ట్ అప్ డేట్

తెలుగు అమ్మాయిలంటే అంత సరదానా! ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ పై మండిపాటు

నన్నెవరూ ట్రాప్‌లో పడేయలేరు, నాతో పెదనాన్న వున్నాడు: మోనాలిసా భోంస్లే

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments