Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణేలో జీబీఎస్ పదో కేసు.. 21 ఏళ్ల యువతి కిరణ్ చికిత్స పొందుతూ మృతి

సెల్వి
బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (15:24 IST)
GBS Virus
పూణేలో గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (GBS) కారణంగా మరణించిన వారి సంఖ్య పదికి చేరింది. తాజాగా 21 ఏళ్ల యువతి కిరణ్ రాజేంద్ర దేశ్‌ముఖ్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కిరణ్‌కు మూడు వారాలకు పైగా జీబీఎస్‌తో పోరాడింది.
 
పూణే సంరక్షక మంత్రి అజిత్ పవార్ నియోజకవర్గం, స్వస్థలం అయిన బారామతిలో నివసించే కిరణ్, తన చదువు కోసం సింహగడ్ ప్రాంతంలోని బంధువులతో కలిసి ఉండగా, ఆమెకు ఈ వ్యాధి సోకింది. 
 
ఈ ప్రాంతంలో అనేక జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. కిరణ్‌ కూడా ఈ వ్యాధి బారిన పడింది. ప్రారంభంలో, ఆమెకు విరేచనాలు, బలహీనత వంటి లక్షణాలు కనిపించాయి. దీనితో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను బారామతికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు నిపుణులు పరీక్షలు నిర్వహించారు.
 
బారామతిలో చికిత్స పొందుతున్నప్పటికీ, ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. ఆమెకు ఉన్న లక్షణాల ఆధారంగా, వైద్యులు జీబీఎస్‌ని అనుమానించారు. తదుపరి చికిత్స కోసం ఆమెను పూణేలోని ఆసుపత్రిలో చేర్చమని ఆమె కుటుంబ సభ్యులకు సలహా ఇచ్చారు. కిరణ్‌ను జనవరి 27న ఆసుపత్రిలో చేర్చారు. కానీ ఆమె ఆరోగ్యం క్షీణించింది. చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మరణించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments