Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సాయం ప్రకటించిన అమిత్ షా

Advertiesment
amit shah

సెల్వి

, బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (14:25 IST)
జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మరో మూడు రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్థిక సహాయం ప్రకటించారు. 2024లో ఊహించని వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ.1,554.99 కోట్ల అదనపు సహాయాన్ని ఆమోదించింది.
 
అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ ఇటీవలి సమావేశంలో ఈ నిధులను మంజూరు చేసింది. కమిటీ నిర్ణయం ప్రకారం, కేటాయించిన మొత్తాన్ని..
 
ఆంధ్రప్రదేశ్ రూ.608.8 కోట్లు, 
తెలంగాణ రూ.231.75 కోట్లు, 
త్రిపుర రూ.288.93 కోట్లు, 
ఒడిశా రూ.255.24 కోట్లు,
నాగాలాండ్ రూ.170.99 కోట్లుగా పంపిణీ చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూజగదిలో రేవంత్ రెడ్డి ఫోటో.. పూజలు చేస్తోన్న కుమారీ ఆంటీ - video viral