Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్జికల్ స్ట్రైక్స్ ఓవర్.. వాట్ నెక్స్ట్ .. ప్రధాని హైలెవల్ మీటింగ్

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (11:03 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న జైషే ఈ మొహమ్మద్ తీవ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళాలు మంగళవారం వేకువజామున 3.30 గంటల సమయంలో మెరుపుదాడులు నిర్వహించాయి. ముజఫరాబాద్ సెక్టార్‌లో జరిగిన ఈ సర్జికల్ స్ట్రైక్స్‌లో జైష్ మొహమ్మద్‌కు చెందిన ఆల్ఫా-3 కంట్రోల్ రూమ్ పూర్తిగా ధ్వంసమైంది. అలాగే, 300 మందికి పైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ మెరుపు దాడులను పాకిస్థాన్ ధృవీకరించింది. భారత్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. 
 
ఇదిలావుంటే, ఈ మెరుపుదాడులను భారత వైమానికదళం విజయవంతంగా పూర్తి చేసింది. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. తాజా సమాచారం మేరకు... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్‌ను తన సహచరులకు ప్రధాని మోడీ వివరించినట్టు తెలుస్తోంది. 
 
వాయుసేన సాధించిన విజయంతో పాటు.. ఇండో-పాక్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితిపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. ఇకపై చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌లతో పాటు జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఇతర అత్యున్నత అధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments