Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురితప్పని 'ప్రళయ్' క్షిపణి - కలాం తీరం నుంచి ప్రయోగం సక్సెస్

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (08:14 IST)
భారత రక్షణ పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) మరో క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల, దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రళయ్ మిస్సైల్‌ను ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ప్రయోగించింది. 
 
'ఈ ప్రయోగంతో అన్ని లక్ష్యాలు నెరవేరాయి. కొత్త క్షిపణి ఆశించిన రీతిలో పాక్షిక క్షిపణి పథాన్ని (క్వాసి బాలిస్టిక్ ట్రాజెక్టరీ) అనుసరించింది. నిర్దేశిత లక్ష్యాన్ని ఖచ్చితమైన వేగంతో చేరుకుంది. అన్ని ఉప వ్యవస్థలు సంతృప్తికరంగా చేరాయి' అని డీఆర్డీవో ఓ పత్రిరా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, కొత్తగా ప్రయోగించిన క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. క్వాసి మిస్సైల్ ట్రాజెక్టరీ కూడా బాలిస్టిక్ క్షిపణి పథంగానే ఉంటుందని తెలిపింది. ఆధునిక పరిజ్ఞానంతో కూడిన ఈ కొత్త క్షిపణి కొత్త తరం క్షిపణి అని డీఆర్డీవో ఛైర్మన్, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ జి.సతీష్ రెడ్డి అన్నారు.
 
ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  కూడా డీఆర్డీవో, శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. "క్వాజీ బాలిస్టిక్ మిస్సైల్‌ను వేగంగా అభివృద్ధి చేసినందుకు నా అభినందనలు. ఇది కీలకమైన మైలురాయి'' అంటూ ట్వీట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments