Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురితప్పని 'ప్రళయ్' క్షిపణి - కలాం తీరం నుంచి ప్రయోగం సక్సెస్

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (08:14 IST)
భారత రక్షణ పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) మరో క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల, దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రళయ్ మిస్సైల్‌ను ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ప్రయోగించింది. 
 
'ఈ ప్రయోగంతో అన్ని లక్ష్యాలు నెరవేరాయి. కొత్త క్షిపణి ఆశించిన రీతిలో పాక్షిక క్షిపణి పథాన్ని (క్వాసి బాలిస్టిక్ ట్రాజెక్టరీ) అనుసరించింది. నిర్దేశిత లక్ష్యాన్ని ఖచ్చితమైన వేగంతో చేరుకుంది. అన్ని ఉప వ్యవస్థలు సంతృప్తికరంగా చేరాయి' అని డీఆర్డీవో ఓ పత్రిరా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, కొత్తగా ప్రయోగించిన క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. క్వాసి మిస్సైల్ ట్రాజెక్టరీ కూడా బాలిస్టిక్ క్షిపణి పథంగానే ఉంటుందని తెలిపింది. ఆధునిక పరిజ్ఞానంతో కూడిన ఈ కొత్త క్షిపణి కొత్త తరం క్షిపణి అని డీఆర్డీవో ఛైర్మన్, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ జి.సతీష్ రెడ్డి అన్నారు.
 
ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  కూడా డీఆర్డీవో, శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. "క్వాజీ బాలిస్టిక్ మిస్సైల్‌ను వేగంగా అభివృద్ధి చేసినందుకు నా అభినందనలు. ఇది కీలకమైన మైలురాయి'' అంటూ ట్వీట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments