గురితప్పని 'ప్రళయ్' క్షిపణి - కలాం తీరం నుంచి ప్రయోగం సక్సెస్

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (08:14 IST)
భారత రక్షణ పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) మరో క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల, దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రళయ్ మిస్సైల్‌ను ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ప్రయోగించింది. 
 
'ఈ ప్రయోగంతో అన్ని లక్ష్యాలు నెరవేరాయి. కొత్త క్షిపణి ఆశించిన రీతిలో పాక్షిక క్షిపణి పథాన్ని (క్వాసి బాలిస్టిక్ ట్రాజెక్టరీ) అనుసరించింది. నిర్దేశిత లక్ష్యాన్ని ఖచ్చితమైన వేగంతో చేరుకుంది. అన్ని ఉప వ్యవస్థలు సంతృప్తికరంగా చేరాయి' అని డీఆర్డీవో ఓ పత్రిరా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, కొత్తగా ప్రయోగించిన క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. క్వాసి మిస్సైల్ ట్రాజెక్టరీ కూడా బాలిస్టిక్ క్షిపణి పథంగానే ఉంటుందని తెలిపింది. ఆధునిక పరిజ్ఞానంతో కూడిన ఈ కొత్త క్షిపణి కొత్త తరం క్షిపణి అని డీఆర్డీవో ఛైర్మన్, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ జి.సతీష్ రెడ్డి అన్నారు.
 
ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  కూడా డీఆర్డీవో, శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. "క్వాజీ బాలిస్టిక్ మిస్సైల్‌ను వేగంగా అభివృద్ధి చేసినందుకు నా అభినందనలు. ఇది కీలకమైన మైలురాయి'' అంటూ ట్వీట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

Shobitha Dhulipala: క్లౌడ్ కిచెన్ గురించి పోస్ట్ పెట్టి శోభితను పడేసిన నాగచైతన్య

Shilpa Shetty: నటి శిల్పా శెట్టి పై ముంబై పోలీసులు దర్యాప్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments