Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కేంద్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం : మళ్లీ లాక్డౌన్?

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (08:01 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రమంత్రివర్గం గురువారం అత్యవసరంగా సమావేశంకానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరుగనుంది. ఇందులో మళ్లీ దేశంలో లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
సౌతాఫ్రికాలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్ వైరస్ ఇపుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. అలాగే, భారత్‌లోని పలు రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు నమోదవుతున్నాయి. ఇది తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. 
 
ముఖ్యంగా కరోనా మొదటి, రెండో వేవ్ సృష్టించిన నష్టం నుంచి ఇప్పుడిపుడే కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చించేందుకు మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమవుతుంది. 
 
గురువారం ఉదయానికి దేశవ్యాప్తంగా 213 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 15 రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాపించింది. దేశ రాజధాని ఢిల్లీలో 57 కేసులు నమోదుకాగా, మహారాష్ట్రలో 54, తెలంగాణాలో 24, కర్నాటకలో 19, రాజస్థాన్‌లో 19, కేరళలో 15, గుజరాత్‌లో 14 ఇలా మొత్తం 15 రాష్ట్రాల్లో 213 ఒమిక్రాన్ కేసులు నమోదైవున్నాయి. ఈ వైరస్ సోకినవారిలో 90 మంది ఇప్పటివరకు కోలుకున్నట్టు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments