నేడు కేంద్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం : మళ్లీ లాక్డౌన్?

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (08:01 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రమంత్రివర్గం గురువారం అత్యవసరంగా సమావేశంకానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరుగనుంది. ఇందులో మళ్లీ దేశంలో లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
సౌతాఫ్రికాలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్ వైరస్ ఇపుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. అలాగే, భారత్‌లోని పలు రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు నమోదవుతున్నాయి. ఇది తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. 
 
ముఖ్యంగా కరోనా మొదటి, రెండో వేవ్ సృష్టించిన నష్టం నుంచి ఇప్పుడిపుడే కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చించేందుకు మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమవుతుంది. 
 
గురువారం ఉదయానికి దేశవ్యాప్తంగా 213 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 15 రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాపించింది. దేశ రాజధాని ఢిల్లీలో 57 కేసులు నమోదుకాగా, మహారాష్ట్రలో 54, తెలంగాణాలో 24, కర్నాటకలో 19, రాజస్థాన్‌లో 19, కేరళలో 15, గుజరాత్‌లో 14 ఇలా మొత్తం 15 రాష్ట్రాల్లో 213 ఒమిక్రాన్ కేసులు నమోదైవున్నాయి. ఈ వైరస్ సోకినవారిలో 90 మంది ఇప్పటివరకు కోలుకున్నట్టు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments