Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కేంద్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం : మళ్లీ లాక్డౌన్?

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (08:01 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రమంత్రివర్గం గురువారం అత్యవసరంగా సమావేశంకానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరుగనుంది. ఇందులో మళ్లీ దేశంలో లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
సౌతాఫ్రికాలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్ వైరస్ ఇపుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. అలాగే, భారత్‌లోని పలు రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు నమోదవుతున్నాయి. ఇది తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. 
 
ముఖ్యంగా కరోనా మొదటి, రెండో వేవ్ సృష్టించిన నష్టం నుంచి ఇప్పుడిపుడే కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చించేందుకు మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమవుతుంది. 
 
గురువారం ఉదయానికి దేశవ్యాప్తంగా 213 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 15 రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాపించింది. దేశ రాజధాని ఢిల్లీలో 57 కేసులు నమోదుకాగా, మహారాష్ట్రలో 54, తెలంగాణాలో 24, కర్నాటకలో 19, రాజస్థాన్‌లో 19, కేరళలో 15, గుజరాత్‌లో 14 ఇలా మొత్తం 15 రాష్ట్రాల్లో 213 ఒమిక్రాన్ కేసులు నమోదైవున్నాయి. ఈ వైరస్ సోకినవారిలో 90 మంది ఇప్పటివరకు కోలుకున్నట్టు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments