Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశ రక్షణ కోసం రాజశ్యామల అనుగ్రహం పొందండి: స్వాత్మానందేంద్ర స్వామి

దేశ రక్షణ కోసం రాజశ్యామల అనుగ్రహం పొందండి: స్వాత్మానందేంద్ర స్వామి
, గురువారం, 23 సెప్టెంబరు 2021 (07:20 IST)
దేశ రక్షణ కోసం జగన్మాత రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం పొందాలని రక్షణ శాఖ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్ డీఓ) ఛైర్మన్ సతీష్ రెడ్డికి విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి సూచించారు.

పూర్వకాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళే ముందు రాజశ్యామల అమ్మవారికి పూజలు చేసి సత్ఫలితాలను సాధించేవారని తెలిపారు. లోకాలను పాలించే రాజమాతంగిగా అమ్మవారు పూజలందుకుంటున్నారని వివరించారు. ఈరోజు ఢిల్లీలో స్వాత్మానందేంద్ర స్వామి డీఆర్ డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆశీస్సులు అందించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దేశంతో పాటు దేశ ప్రజల రక్షణకు సైతం డీఆర్ డీఓ కట్టుబడి ఉందన్నారు. కరోనా ఆపత్కాలంలో ఇమ్యూనిటీ పెంచే 2 - డీ పౌడరును తయారు చేసామని, దేశవ్యాప్తంగా వేయి(1000) ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.

ఇప్పటికే పదివేల ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేసి సేవలందించామని స్వామీజీకి వివరించారు. తన హయాంలో రాడార్, క్షిపణి వ్యవస్థలను అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. రాజశ్యామల అనుగ్రహంతో మరింత పటిష్టంగా రక్షణ శాఖను తీర్చిదిద్దాలని ఛైర్మన్ సతీష్ రెడ్డికి స్వాత్మానందేంద్ర స్వామి ఆశీస్సులు అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15 నుంచి చిన వెంకన్న కల్యాణోత్సవాలు