Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటితో గొడవ, మూత్రం తాగించారు, ఆత్మహత్య చేసుకున్నాడు..

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (12:07 IST)
మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పక్కింటి వారితో ఏర్పడిన జగడం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. పక్కనే వున్న కుటుంబంలో జరిగిన గొడవ కారణంగా బలవంతంగా మూత్రం తాగించడంతో.. ఆ అవమానం తాళలేక మధ్యప్రదేశ్ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ శివపురి జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. వికాశ్‌ శర్మ అనే వ్యక్తి తాగునీరు తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో పక్కనే కుటుంబంతో వికాశ్‌ శర్మకు గొడవ జరిగింది. దీంతో శర్మను తీవ్రంగా చితకబాది, బలవంతంగా మూత్రం తాగించారు.
 
ఈ అవమానాన్ని తట్టుకోలేని శర్మ.. తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంకా అక్కడ సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. పక్కింట్లో ఉన్న మనోజ్‌ కోలి, తారావతి కోలి, ప్రియాంక కోలి కలిసి తనను కొట్టారని, మూత్రం తాగించారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌లో శర్మ పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

శర్మ హత్య కేసులో నిందితులైన మనోజ్‌, తారావతి, ప్రియాంకను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రెండు కుటుంబాల మధ్య గత ఏడాదిన్నర కాలం నుంచి వివాదాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments