Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చేపల వలలో నోట్ల కట్టలు.. షాకైన బాలుడు.. ఎక్కడ?

చేపల వలలో నోట్ల కట్టలు.. షాకైన బాలుడు.. ఎక్కడ?
, మంగళవారం, 12 మే 2020 (18:28 IST)
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్‌లో వుండి బోర్ కొట్టేసింది. దీంతో ఓ బాలుడు చేపల వేటకు వెళ్లాడు. ఎప్పటిలాగానే వల వేశాడు. కానీ చేపలు చిక్కలేదు. నోట్ల కట్టలు చిక్కాయి. అంతే షాకైయ్యాడు. ఆ నోట్ల కట్లను ఇంటికి తెచ్చాడు. అన్నీ రూ. 500,రూ. 2000 నోట్లే. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ అరుద్ గ్రామానికి చెందిన ఓ బాలుడు చేపల వేటకు వెళ్లాడు. ఎప్పట్లానే వల వేశాడు.
 
అయితే ఎవరు.. ఎప్పుడు..ఎందుకు వేశారో తెలియదు కానీ అందులోనుంచి నోట్ల కట్ట బయటకు వచ్చింది. వాటిని బయటకు తీయగానే.. గాలి బలంగా వీయడంతో నోట్లన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. మెల్లగా వాటిని ఏరుకొని ఇంటికి వెళ్లాడు. 
 
ఈ విషయం తెలియరావడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నోట్ల కట్టను ఎవరు..? ఎందుకు..? అలా నీళ్లలో కరెన్సీని ఎందుకు విసిరేశారనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లడఖ్ నియంత్రణ రేఖ వెంబడి చైనా యుద్ధ విమానాలు..