Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శివుని కోసం.. దాన్ని స్పూన్‌తో కత్తిరించుకున్న ఖైదీ.. ఎక్కడో తెలుసా?

శివుని కోసం.. దాన్ని స్పూన్‌తో కత్తిరించుకున్న ఖైదీ.. ఎక్కడో తెలుసా?
, బుధవారం, 6 మే 2020 (14:42 IST)
jail
మధ్యప్రదేశ్ గ్వాలియర్ నగరంలోని సెంట్రల్ జైలులో 25 ఏళ్ల హత్య నేరస్థుడు స్పూనుతో తన మర్మాంగాన్ని కత్తిరించుకున్నాడు. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్వాలియర్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో ఒక గుడి ఉంది. అక్కడ జైలులోని ఖైదీలు నిత్యం ప్రార్థనలు చేస్తుంటారు. మంగళవారం కూడా ఖైదీలు ప్రార్థనలు చేస్తుండగా.. ఒక నేరస్థుడు ఒక్కసారిగా లేచి నిలబడి స్పూన్‌తో తన జననాంగాన్ని కత్తిరించుకున్నాడు.
 
‘మే 5న గ్వాలియర్ సెంట్రల్ జైలులో ఉన్న దోషుల్లో ఒకరు జైలు ప్రాంగణంలోని ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నాడు. అతను అకస్మాత్తుగా లేచి నిలబడి హవాన్ కోసం ఉపయోగించే చెంచాతో తన మర్మాంగాలను కత్తిరించుకున్నాడు. 
 
ఆ ఖైదీ 2018 నుంచి జైలులో ఖైదీగా ఉన్నాడని జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ తెలిపారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా వుందని ప్రభాత్ కుమార్ వెల్లడించారు. 
 
పోలీసుల విచారణలో, కుమార్ అనే పేరున్న ఆ ఖైదీ తన ప్రైవేట్ భాగాలను ఆలయంలో సమర్పించమని శివుడు కోరినట్లు కలలు కన్నానని పేర్కొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రంలో మే 29 వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగిస్తున్నాం.. కేసీఆర్