Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై బీచ్ స్టేషనులో ఫ్లాట్‌ఫాం పైకి దూసుకొచ్చిన రైలు

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (19:25 IST)
చెన్నై బీచ్ రైల్వే స్టేషనులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం ఓ సబర్బన్ రైలు అదుపుతప్పి ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ఈ విద్యుత్ రైలు నియంత్రణ కోల్పోడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే, అదృష్టవశాత్తు డ్రైవరు కిందికి దూకేయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే, ఈ రైలు మాత్రం పట్టాలు తప్పి  ఫ్లాట్‍ఫాంపైకి దూసుకెళ్లి అక్కడ నుంచి ఫ్లాట్‌పాంను చివరి భాగాన్ని ఢీకొట్టింది. 
 
ఈ క్రమంలో రైలు ఫ్లాట్‌ఫాంపైకి ఎక్కింది. దీంతో స్టేషన్ పైకప్పు కూడా దెబ్బతింది. రైలు ప్రమాదానికి గురైన సమయంలో రైలులో ప్రయాణికులు లేరు. ఈ రైలు షెడ్డు నుంచి బీచ్ స్టేషన్‌కు వచ్చింది. పైగా, ఆదివారం కావడంతో రైల్వే స్టేషనులో కూడా ప్రయాణికుల సంఖ్య పెద్దగా లేదు. దీంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. 
 
ఈ ప్రమాదం గురించి దక్షిణ రైల్వే ప్రధాన పీఆర్వో బి.గుహనేశన్ మాట్లాడుతూ, ప్రమాదానికి గురైన రైలు షెడ్డు నుంచి బీస్ స్టేషన్‌ ఒకటో నంబరు ఫ్లాట్‌ఫాంపైకి వచ్చిందని. అయితే, నియంత్రణ కోల్పోయిన రైలు ఫ్లాట్‌ఫాంను ఢీకొట్టిందని ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదన్నారు. మరోవైపు, ఈ ప్రమాదంపై విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments