Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ తరహాలో తమిళనాడులో గ్రామ సచివాలయాలు.. స్టాలిన్ ప్రకటన

ఏపీ తరహాలో తమిళనాడులో గ్రామ సచివాలయాలు.. స్టాలిన్ ప్రకటన
, శనివారం, 23 ఏప్రియల్ 2022 (13:03 IST)
దేశంలోనే మొదటిసారిగా గ్రామ సచివాలయాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 2019 ఎన్నికల్లో విజయం సాధించి, తొలిసారి అధికారంలోకి వచ్చిన జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ.. అదే ఏడాది అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాలకు శ్రీకారం చుట్టింది. 
 
ఇదే తరహాలో తమిళనాడులోనూ గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీ వేదికగా శుక్రవారం ఓ ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నట్లు స్టాలిన్ ప్రకటించారు.  ఈ ఏడాది 600 గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేయనున్నట్టు స్టాలిన్ తెలిపారు. 
 
అన్ని సౌకర్యాలతో గ్రామ సచివాలయాలను నిర్మిస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లో సమావేశ మందిరంతో సహా అన్ని సౌకర్యాలు ఉంటాయని, ఒక్కొక్కటి రూ.40 లక్షల అంచనాతో నిర్మించనున్నట్టు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ మూడు ఘటనలపై నివేదిక ఎక్కడ.. గవర్నర్ ప్రశ్న