Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరువులో హెచ్ఐవీ బాధితురాలి మృతదేహం.. నీటిని తోడేశారు..

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (17:45 IST)
హెచ్ఐవీ బాధితురాలు చెరువులో పడిందని, ఆమె మృతదేహాన్ని చేపలు తినేశాయి. ఆ నీరు కలుషితం అయిపోయానని గ్రామస్తులు ఒత్తిడి చేశారు. గ్రామస్తుల ఒత్తిడితో చెరువులోని నీటిని అధికారులు ఖాళీ చేయించిన ఘటన కర్ణాటకలోని హుబ్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హుబ్లి జిల్లా మొరాబ్ గ్రామంలో 23 ఎకరాల చెరువులోకి నీటిని తోడేశారు. 
 
ఇందుకు నవంబర్ 29న ఆ చెరువులో హెచ్‌ఐవీ సోకిన ఓ మహిళ (27) మృతదేహం తేలియాడటమే. అప్పటికే ఆమె శరీరాన్ని చేపలు సగం తినేశాయి. దీన్ని గమనించిన గ్రామస్తులు.. ఆ నీటిని వినియోగించేందుకు నిరాకరించారు. నీరు మొత్తం హెచ్ఐవీ వైరస్‌తో కలుషితం అయిపోయిందని.. భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామానికి వచ్చి ల్యాబ్ టెస్టు కోసం నీటిని పంపుతామన్నారు. కానీ గ్రామస్తులు వినలేదు. నీటిలో హెచ్ఐవీ వుందని, ఆ నీటిని వినియోగించేది లేదన్నారు. 
 
దాదాపు వెయ్యి మంది గ్రామస్తులు ఎనిమిది వాటర్ ట్యాంకులతో చెరువు వద్దకు చేరుకున్నారు చెరువు నీటిని నాలుగు మోటార్లతో 20 ట్యూబుల సాయంతో ఖాళీ చేయించారు. చెరువును నీటిని ఖాళీ చేయించామని.. చెరువును శుభ్రం చేసిన తర్వాత మాలాప్రభ కెనాల్ ద్వారా మళ్లీ నీటిని నింపుతామని స్థానిక తహసీల్దార్ చెప్పారు. 
 
గ్రామస్తుల భయానికి ఎలాంటి శాస్త్రీయత లేదని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజ్ చెప్పారు. హెచ్ఐవీతో నీరు మొత్తం కలుషితమైందని భావించడం సబబు కాదని.. 25 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు... నీటిలో ఎనిమిది గంటలకు మించి వైరస్ బతకదని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments