Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేట కేసులో సల్మాన్‌కు ఊరట.. అందరూ రావాల్సిందే

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (11:23 IST)
దాదాపు 20 సంవత్సరాలుగా నలుగుతున్న రాజస్థాన్ కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఊరట లభించింది. ఈ కేసు తీర్పును రాజస్థాన్ హైకోర్టు జూలై 4వ తేదీకి వాయిదా వేసింది. కృష్ణజింకల వేట కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చేసిన అప్పీల్‌పై విచారణ జరుగుతోంది. నిజానికి ఏప్రిల్ 4వ తేదీనే ఈ తీర్పు వెల్లడించాల్సి ఉంది, కానీ న్యాయస్థానం దీనిని వాయిదా వేస్తూ ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రతీ ఒక్కరు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
 
1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు జోధ్‌పూర్ దగ్గర్లో ఉన్న కంకణి ప్రాంతంలో కృష్ణ జింకలను బాలీవుడ్ కండల వీరుడు వేటాడినట్లు ఆరోపణలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో సల్మాన్ ఖాన్‌తో పాటుగా సైఫ్ ఆలీ ఖాన్, నీలమ్, టబు, సొనాలి బింద్రే కూడా నిందుతులుగా ఉన్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 51, 149 క్రింద కేసు నమోదైంది. ఈ కేసులో సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. ఒక రోజు శిక్ష అనంతరం బెయిల్‌పై సల్మాన్ బయటకు వచ్చి, ఈ తీర్పును సవాల్ చేస్తూ కోర్టులో పిటీషన్ వేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments