Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేట కేసులో సల్మాన్‌కు ఊరట.. అందరూ రావాల్సిందే

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (11:23 IST)
దాదాపు 20 సంవత్సరాలుగా నలుగుతున్న రాజస్థాన్ కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఊరట లభించింది. ఈ కేసు తీర్పును రాజస్థాన్ హైకోర్టు జూలై 4వ తేదీకి వాయిదా వేసింది. కృష్ణజింకల వేట కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చేసిన అప్పీల్‌పై విచారణ జరుగుతోంది. నిజానికి ఏప్రిల్ 4వ తేదీనే ఈ తీర్పు వెల్లడించాల్సి ఉంది, కానీ న్యాయస్థానం దీనిని వాయిదా వేస్తూ ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రతీ ఒక్కరు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
 
1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు జోధ్‌పూర్ దగ్గర్లో ఉన్న కంకణి ప్రాంతంలో కృష్ణ జింకలను బాలీవుడ్ కండల వీరుడు వేటాడినట్లు ఆరోపణలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో సల్మాన్ ఖాన్‌తో పాటుగా సైఫ్ ఆలీ ఖాన్, నీలమ్, టబు, సొనాలి బింద్రే కూడా నిందుతులుగా ఉన్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 51, 149 క్రింద కేసు నమోదైంది. ఈ కేసులో సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. ఒక రోజు శిక్ష అనంతరం బెయిల్‌పై సల్మాన్ బయటకు వచ్చి, ఈ తీర్పును సవాల్ చేస్తూ కోర్టులో పిటీషన్ వేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments