Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేట కేసులో సల్మాన్‌కు ఊరట.. అందరూ రావాల్సిందే

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (11:23 IST)
దాదాపు 20 సంవత్సరాలుగా నలుగుతున్న రాజస్థాన్ కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఊరట లభించింది. ఈ కేసు తీర్పును రాజస్థాన్ హైకోర్టు జూలై 4వ తేదీకి వాయిదా వేసింది. కృష్ణజింకల వేట కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చేసిన అప్పీల్‌పై విచారణ జరుగుతోంది. నిజానికి ఏప్రిల్ 4వ తేదీనే ఈ తీర్పు వెల్లడించాల్సి ఉంది, కానీ న్యాయస్థానం దీనిని వాయిదా వేస్తూ ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రతీ ఒక్కరు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
 
1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు జోధ్‌పూర్ దగ్గర్లో ఉన్న కంకణి ప్రాంతంలో కృష్ణ జింకలను బాలీవుడ్ కండల వీరుడు వేటాడినట్లు ఆరోపణలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో సల్మాన్ ఖాన్‌తో పాటుగా సైఫ్ ఆలీ ఖాన్, నీలమ్, టబు, సొనాలి బింద్రే కూడా నిందుతులుగా ఉన్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 51, 149 క్రింద కేసు నమోదైంది. ఈ కేసులో సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. ఒక రోజు శిక్ష అనంతరం బెయిల్‌పై సల్మాన్ బయటకు వచ్చి, ఈ తీర్పును సవాల్ చేస్తూ కోర్టులో పిటీషన్ వేసారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments