Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలుకలకు పెట్టిన మందు తిని 12 నెమళ్లు మృతి

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (11:48 IST)
తమిళనాడు రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. ఎలుకలను చంపేందుకు పెట్టిన మందు తిని 12 నెమళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటనకు కారణమైన రైతుని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ హృదయవిదారక ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి సమీపంలోని నాచ్చియార్ కుప్పం అనే ప్రాంతంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన షణ్ముగం (75) అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం ఓ మహిళకు చెందిన భూమిని కౌలుకు తీసుుకుని సాగు చేశాడు. 
 
అయితే, ఈ సాగు చేతికొచ్చే సమయంలో ఎలుకలు, నెమళ్లు ధ్వంసం చేయడాన్ని గమనించారు. దీంతో ఎలుకలను చంపేందుకు పొలంలో మందు పెట్టాడు. ఈ మందును నెమళ్లు ఆరగించాయి. దీంతో అవి ప్రాణాలు కోల్పోయాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... చనిపోయిన నెమళ్ళను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రైతును అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments