Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిడ్ డే మీల్స్ వికటించింది .. 80 మంది విద్యార్థులకు అస్వస్థత

మిడ్ డే మీల్స్ వికటించింది .. 80 మంది విద్యార్థులకు అస్వస్థత
, గురువారం, 28 అక్టోబరు 2021 (11:34 IST)
తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో మధ్యాహ్న భోజనం వికటించింది. ఫలితంగా 80 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. బీర్కూర్‌ మండల కేం ద్రంలో బుధవారం చోటు చేసుకుంది. 
 
స్థానిక ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో రోజూ మాదిరిగానే 321 విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కొక్కరికి వాంతులు, కడుపునొప్పి ప్రా రంభమైంది. దీంతో ఉపాధ్యాయులు ఈ విషయం బయటికి పొక్కకుండా ప్రయత్నించారు. 
 
పరిస్థితి చేయిదాటి పోతుండడంతో మండల వైద్యాధికారికి రాజారమేశ్‌కు సమాచారం అందించారు. సిబ్బందితో అక్కడి చేరుకున్న ఆయన విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం 108 అంబులెన్స్‌లో బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించారు. విద్యార్థులంతా చికిత్స పొందుతున్నారని తహసీల్దార్‌ రాజు తెలిపారు.
 
ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ తిలకేశ్వరి రఘు, ఎస్సై రాజేశ్‌, రైతు బంధు సమితి అధ్యక్షుడు అవారి గంగారాం పాఠశాలకు చేరుకొని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు చేరుకున్న డీఎంహెచ్‌వో కల్పన భోజనం శాంపిళ్లను సేకరించాలని మండల వైద్యాధికారిని ఆదేశించారు. శాంపిళ్లను ల్యాబ్‌కు పంపిన తర్వాతే కారణాలు తెలుస్తాయన్నారు. బాధిత చిన్నారులను తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆస్పత్రికెళ్లి పరామర్శించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరిచిన పాముతో ఆస్పత్రికి చికిత్సకు వచ్చిన మహిళ