Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీచరు కాదు కామాంధుడు.. క్లాస్ రూమ్‌లో బాలికలకు నీలి చిత్రాలు...

టీచరు కాదు కామాంధుడు.. క్లాస్ రూమ్‌లో బాలికలకు నీలి చిత్రాలు...
, సోమవారం, 25 అక్టోబరు 2021 (10:21 IST)
గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ఓ కామాంధ టీచర్ నీచంగా ప్రవర్తించాడు. తరగతి గదిలోనే తన వద్ద చదవుకునే విద్యార్థినులకు నీలి చిత్రాలు చూపిస్తూ పైశాచికానందం పొందసాగాడు. అయితే, అతని పాపం పండటంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సత్తెనపల్లి 17వ వార్డులోని శాలివాహన నగర్‌లో ఎంపీపీఎస్ (ఉర్దూ) పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలిక తనకు తలనొప్పిగా ఉందని రాత్రి తన తల్లితో చెప్పింది. దీంతో ఏం జరిగిందని ప్రశ్నించగా.. ఆమె చెప్పిన సమాధానం విని విస్తుపోయింది.
 
ఉపాధ్యాయుడు హుస్సేన్ బూతు చిత్రాలు చూపిస్తూ ఇబ్బంది పెడుతున్నాడంటూ బోరున విలపించింది. దీంతో ఆమె ఆరా తీయగా మరికొందరు బాలికలు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. బాలికల తల్లిదండ్రులు వెంటనే నిందితుడైన ఉపాధ్యాయుడు హుస్సేన్‌కు ఫోన్ చేయగా దురుసుగా మాట్లాడాడు.
 
దీంతో వారందరూ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. హుస్సేన్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. పోలీసుల హామీతో ఆ తర్వాత వారు ఆందోళన విరమించారు. మరోవైపు, ఈ ఘటనపై డీఈవో గంగాభవాని స్పందించారు. బాధితుల ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బద్వేలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సిపిఐ మద్దతు