Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హస్తినలో భారీ అగ్నిప్రమాదం - ఏడుగురి సజీవదహనం

హస్తినలో భారీ అగ్నిప్రమాదం - ఏడుగురి సజీవదహనం
, శనివారం, 12 మార్చి 2022 (11:01 IST)
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. అలాగే, సుమారుగా వంద గుడిసెల వరకు కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపకదళ బృందం 13 ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశాయి. 
 
ఢిల్లీలోని గోకుల్‌పురి ఏరియాలో ఈ ప్రమాదం సంభవించింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేయాల్సివచ్చింది. మరోవైపు, ఈ ప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని సందర్శిస్తానని, అగ్నిప్రమాద బాధితులతో వ్యక్తిగతంగా మాట్లాడుతానని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజధాని అవసరాల నిమిత్తం రూ.1329.21 కోట్లు కేటాయింపు