Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోడ్డు ప్రమాదంలో డీఎంకే ఎంపీ కుమారుడు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో డీఎంకే ఎంపీ కుమారుడు దుర్మరణం
, గురువారం, 10 మార్చి 2022 (12:32 IST)
తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అధికార డీఎంకేకు చెందిన రాజ్యసభ సభ్యుడు ఎన్.ఆర్. ఇళంగోవన్ కుమారుడు రాకేష్ (22)తో పాటు మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వీరిద్దరూ పుదుచ్చేరి నుంచి చెన్నైకు వెళుతుండగా, గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. అమిత వేగంతో వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌‍ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాకేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆయనతో కలిసి ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో కారును పక్కకు తొలగించి వాహనరాకపోకలను పునరుద్ధరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇళంగోవన్ రాజ్యసభలో డీఎంకే తరపున గత 2020 నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చక్రం తిప్పే ఏనుగు బొమ్మ పార్టీ(BSP), సైకిల్(SP) చక్రాల పరుగులకు బ్రేకులేసి కమల(BJP) వికాసం ఎలా జరిగింది?