Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐదుగురు జవాన్లను కాల్చివేసిన సహ జవాను

ఐదుగురు జవాన్లను కాల్చివేసిన సహ జవాను
, ఆదివారం, 6 మార్చి 2022 (18:05 IST)
పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్‌ క్యాంపులో భారత సరిహద్దు దళానికి చెందిన ఓ జవాను కిరాతక చర్యకు పాల్పడ్డాడు. ఐదుగురు సాటి జావన్లను తుపాకీతో కాల్చివేశాడు. తనను తోటి జవాన్లు అవహేళనకు గురిచేయడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన జవాను తన వద్ద తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటనలో మొత్తు ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 
 
కాగా, ఈ కాల్పుల ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో మరో జవాను కూడా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భక్తుడుని బూతులు తిట్టి దాడి చేసిన పూజారి