Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసి భద్రత పెంపు.. స్మార్ట్ నిఘా వ్యవస్థ.. నేరగాళ్లకు చుక్కలే..

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (10:40 IST)
వారణాసిలో భద్రత మరింత పెరగనుంది. నిత్యం లక్షలాది మంది భక్తులు సందర్శిస్తున్న వారాణాసి నగరంలో స్మార్ట్ నిఘా వ్యవస్థ ఏర్పాటుతో నేరగాళ్ల సంచారంపై నిఘా పెరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గ కేంద్రమైన ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలో 3వేల సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. 
 
అధునాతన భారతీయ, యూరోపియన్, అమెరికన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముఖ గుర్తింపు కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వారణాసి స్మార్ట్ సిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గౌరంగ్ తెలిపారు. 
 
అవసరమైతే ముఖ గుర్తింపు కెమెరాల సంఖ్యను పెంచుతామని ఆయన చెప్పారు. 720 ప్రాంతాల్లో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీటిని కమాండ్ కంట్రోల్ సెంటరుతో అనుసంధానించారు. రూ.128 కోట్లతో ఆప్టికల్ ఫైబర్ లైన్ వేస్తున్నామని కమిషనర్ చెప్పారు.
 
ముఖ గుర్తింపు కెమెరాలు నేరస్థులను సులభంగా పట్టుకుంటాయని కమిషనర్ చెప్పారు. వాంటెడ్ క్రిమినల్‌ను ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలో బంధిస్తే, అది కెఐసిసిసి వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. వారు సంబంధిత పోలీస్ స్టేషనుకు తెలియజేస్తారు. దీంతో పోలీసులు వచ్చి నేరస్థుడిని అరెస్టు చేస్తారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments