Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషి చివరి కోరిక కోసం మరో 14 రోజులు, ఆ నలుగుర్నీ త్వరగా ఉరి తీయండి

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (18:31 IST)
నిర్భయ దోషులకు విధించిన ఉరి శిక్ష అమలు విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులతో ముందుకు సాగుతోంది. దోషులు ఒకరి తర్వాత ఒకరు కోర్టులకు వెళ్తూ, రాష్ట్రపతి క్షమాభిక్ష అంటూ సాగదీస్తున్నారు. ఫిబ్రవరి 1 తెల్లవారు జామున వాళ్లను ఉరి తీస్తారని అంతా అనుకుంటున్న సమయంలో దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నాడు. 
 
దీనితో శనివారం ఉరితో గాలిలో కలిసిపోవాల్సిన ఆ నలుగురి ప్రాణాలు జైలు గోడల మధ్య అలాగే వున్నాయి. వినయ్ శర్మ క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి తిరస్కరించారు కానీ జైలు నిబంధనల ప్రకారం ఏ దోషి అయినా ఇలా దరఖాస్తు చేసుకుని అది తిరస్కరణకు గురైతే అతడికి చివరి కోరికను తీర్చుకునేందుకు 14 రోజుల గడవు ఇస్తారట. 
 
అందువల్ల ఫిబ్రవరి 1న ఉరి తీయడానికి కుదర్లేదు. దీనితో నిర్భయ తల్లిదండ్రులు మరోసారి కోర్టులో నిర్భయ నిందితులను త్వరగా ఉరి తీయాలంటూ పిటీషన్ వేయబోతున్నట్లు సమాచారం. మరి వారి అభ్యర్థన మేరకు నిర్భయ నిందితులను 14 రోజుల లోపుగానే ఉరి తీస్తారా లేదంటే అప్పటి దాకా ఆగుతారా చూడాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments