Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సిద్ధాంతాలను మీరితే వెంటనే చర్యలు : ఆనంద్ మహీంద్రా

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (14:55 IST)
ఇటీవల కర్నాటక రాష్ట్రంలోని తుముకూరులోని మహింద్రా షోరూమ్‌‍లో ఓ రైతుకు జరిగిన అవమానంపై మహింద్రా అండ్ మహీంద్రా సంస్థ యజమాని ఆనంద్ మహీంద్రా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వ్యక్తి గౌరవాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మా భాగస్వాముల అభివృద్ధికి పని చేయడమే మా విధానం అని స్పష్టం చేశారు. తమ సిద్ధాంతాలను మీరితో వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 
 
కెంపెగౌడకు చెందిన ఓ రైతు బొలెరో పికప్ ట్రక్ కొనుగోలు చేసేందుకు తుముకూరులోని మహీంద్రా షోరూమ్‌కు వెళ్ళి కారు కావాలని అడిగాడు. దానికి సేల్స్‌మేన్.. నీ జేబులో రూ.10 కూడా ఉండవు రూ.10 లక్షలు కారు కొంటావా?. మొహం చూడు అంటూ హేళనగా మాట్లాడారు. 
 
దీంతో అహం దెబ్బతిన్న ఆ రైతు.. అర్థగంటలో రూ.10 లక్షల డబ్బులు తెచ్చి... అప్పటికప్పుడు ట్రక్‌ను డెలివరీ చేయాలంటూ సేల్స్‌మెన్‌ను డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దిరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను చాలా మంది ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేయడంతో ఆయన స్పందించారు. 
 
"మా కమ్యూనిటీలో వారు, భాగస్వాముల అభివృద్ధి కోసం పని చేయడమే మహీంద్రా సంస్థ ప్రధాన విధానం. వ్యక్తుల ఆత్మగౌరవాన్ని కాపావడటం మా ప్రధాన విలువ. ఈ సిద్ధాంతాలను రాజీ లేకుండా అమలు చేస్తాం. ఎవరైనా వాటిని మీరినట్టు తేలితో అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments