Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సిద్ధాంతాలను మీరితే వెంటనే చర్యలు : ఆనంద్ మహీంద్రా

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (14:55 IST)
ఇటీవల కర్నాటక రాష్ట్రంలోని తుముకూరులోని మహింద్రా షోరూమ్‌‍లో ఓ రైతుకు జరిగిన అవమానంపై మహింద్రా అండ్ మహీంద్రా సంస్థ యజమాని ఆనంద్ మహీంద్రా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వ్యక్తి గౌరవాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మా భాగస్వాముల అభివృద్ధికి పని చేయడమే మా విధానం అని స్పష్టం చేశారు. తమ సిద్ధాంతాలను మీరితో వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 
 
కెంపెగౌడకు చెందిన ఓ రైతు బొలెరో పికప్ ట్రక్ కొనుగోలు చేసేందుకు తుముకూరులోని మహీంద్రా షోరూమ్‌కు వెళ్ళి కారు కావాలని అడిగాడు. దానికి సేల్స్‌మేన్.. నీ జేబులో రూ.10 కూడా ఉండవు రూ.10 లక్షలు కారు కొంటావా?. మొహం చూడు అంటూ హేళనగా మాట్లాడారు. 
 
దీంతో అహం దెబ్బతిన్న ఆ రైతు.. అర్థగంటలో రూ.10 లక్షల డబ్బులు తెచ్చి... అప్పటికప్పుడు ట్రక్‌ను డెలివరీ చేయాలంటూ సేల్స్‌మెన్‌ను డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దిరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను చాలా మంది ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేయడంతో ఆయన స్పందించారు. 
 
"మా కమ్యూనిటీలో వారు, భాగస్వాముల అభివృద్ధి కోసం పని చేయడమే మహీంద్రా సంస్థ ప్రధాన విధానం. వ్యక్తుల ఆత్మగౌరవాన్ని కాపావడటం మా ప్రధాన విలువ. ఈ సిద్ధాంతాలను రాజీ లేకుండా అమలు చేస్తాం. ఎవరైనా వాటిని మీరినట్టు తేలితో అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments