Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సుల్లో చార్జీల తగ్గింపు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (14:43 IST)
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ చార్జీలను 20 శాతం మేరకు తగ్గించారు. ముఖ్యంగా, కృష్ణా జిల్లా హైదరాబాద్ ప్రాంతాల మధ్య నడిచే బస్సులో ఈ ప్రయాణ చార్జీల తగ్గింపు అమలుకురానుంది. కృష్ణా జిల్లాకు చెందిన అన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సులో 20 శాతం మేరకు బస్సు చార్జీలను తగ్గించాలని నిర్ణయించింది. 
 
ముఖ్యంగా, ఇంద్ర, అమరావతి, గరుడ, నైట్ రైడర్, వెన్నెల స్లీపర్ వంటి బస్సుల్లో తగ్గింపు చార్జీలు వర్తిస్తాయి. కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఈ తగ్గింపు చార్జీలు వర్తిస్తాయి. అలాగే, హైదరాబాద్ నుంచి కృష్ణ జిల్లాకు వచ్చేవారికి మాత్రం శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో  ఈ తగ్గింపు ఉంటుంది. 
 
కాగా, ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ కూడా ప్రయాణికులను ఆకర్షించేందుకు పలు రకాలైన చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా, ప్రయాణికుల ముంగిటకే ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉండేలా చర్యలు తీసుకున్న విషయం తెల్సిందే. సంక్రాంతి కోసం నడిపిన ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు లేకుండా నడిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments