Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రైమ్9 న్యూస్ తెలుగు ఛానల్ కరెస్పాండెంట్ అయ్యప్ప ఆత్మహత్యాయత్నం

Advertiesment
prime 9 news
విజయవాడ , శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (12:01 IST)
ప్రైమ్9 న్యూస్ తెలుగు ఛానల్ ఖమ్మం జిల్లా కరెస్పాండెంట్ అయ్యప్ప ఆత్మహత్యాయత్నం చేశాడు. అకారణంగా, అకస్మాత్తుగా, కనీస సమాచారం లేకుండా తనను జిల్లా రిపోర్టర్ గా తొలగించారంటూ మనస్తాపంతో నిద్ర మాత్ర‌లు మింగాడు. యాజమాన్యం విధించిన అన్ని టార్గెట్లను పూర్తి చేసినా, ఇటీవల ఆంధ్రాకు చెందిన బడే సైదాబాబు ఇన్పుట్ ఎడిటర్ గా జాయిన్ అయిన కొద్దిరోజుల్లోనే వ్యక్తిగత స్వార్థాలకు అమ్ముడుపోయి తన అనుంగులకు స్థానం కల్పించాడని ఆరోపణ చేస్తున్నాడు. 
 
 ఒక్కో మెట్టెక్కి ఎదిగిన తాను, ఉద్యోగ భద్రత కోల్పోయానంటూ మనస్తాపం చెంది అయ్య‌ప్ప నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అత‌ని పరిస్థితి విషమించ‌డంతో ఆసుపత్రికి తరలించారు. అయినా, స్పందించని ప్రైమ్ 9 యాజమాన్యంపై జ‌ర్న‌లిస్టు సంఘాలు మండిప‌డుతున్నాయి.

ఛాన‌ల్ పై బీసీ కమిషన్ లో ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు జర్నలిస్టు సంఘాల నేతలు. ఉద్యోగ సిబ్బంది జీవితాలతో చెలగాటమాడే జర్నలిస్టు  బడే అరాచకాలు, వేధింపుల నుంచి సిబ్బందికి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర మంత్రికి, ఆయన ఫ్యామిలీకి లుకౌట్ నోటీసులు