Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో విద్యార్థులకు దూరదర్శన్‌ సప్తగిరి ఛానల్‌ ద్వారా టీవీ క్లాసులు

ఏపీలో విద్యార్థులకు దూరదర్శన్‌ సప్తగిరి ఛానల్‌ ద్వారా టీవీ క్లాసులు
, శనివారం, 12 జూన్ 2021 (12:13 IST)
కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఏపీలో విద్యార్థుల చ‌దువుల‌కు ఆటంకుం లేకుండా ఉండేందుకు 1-10 తరగతులకు దూరదర్శన్‌ సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు. 1-5 తరగతులకు బ్రిడ్జి కోర్స్, 6-9 క్లాసెస్ స్టూడెంట్ల‌కు సబ్జెక్టు లెస‌న్స్ బోధిస్తారు. పిల్లలకు వచ్చే డౌట్స్ క్లారిఫై చేసేందుకు టీచ‌ర్స్ వారానికి ఒక‌సారి పాఠశాలలకు రానున్నారు. టీవీ పాఠాలపై ఏవైనా సందేహాలు వస్తే విద్యార్థులు ఆ రోజుల్లో స్కూల్స్‌కు రావచ్చు.
 
1 నుంచి 5వ త‌రగ‌తి స్టూడెంట్స్ కోసం స్పెష‌ల్‌గా రూపొందించిన‌ బ్రిడ్జి కోర్సు పుస్తకాలను వారికి అందించనున్నారు. ఇంగ్లీషు మీడియం విధానంలోనే ఇంగ్లీషు, మ్యాథ్స్, తెలుగు సబ్జెక్టులు బోధిస్తారు. 1, 2 తరగతులకు ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటలు, 3, 4, 5 తరగతులకు 11.30 గంటల నుంచి 12 గంటల వరకు క్లాసెస్ ఉంటాయి. 6-9 తరగతులకు అన్ని సబ్జెక్టులను చెబుతారు. 
 
6, 7 తరగతులకు మధ్యాహ్నం 2గంటల నుంచి 3గంటల వరకు, 8, 9 తరగతులకు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు టెలికాస్ట్ అవుతాయి. జూన్‌ నెల చివరి వరకు ఈ క్లాసెస్ నిర్వహిస్తారు. టెన్త్ విద్యార్థులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న రెండు గంటల కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.
 
1-5 క్లాసెస్ కు పాఠాలు బోధించే టీచ‌ర్స్ విద్యార్థులకు వచ్చే డౌట్స్ క్లారిఫై చేసేందుకు ఈ నెల 16 నుంచి ప్రతి మంగళవారం పాఠశాలకు హాజరుకావాలి. 6-7 తరగతుల హెచ్.ఎమ్, టీచ‌ర్స్ 17వ తేదీ నుంచి ప్రతి బుధవారం పాఠశాలలకు వెళ్లాలి. 8-9 తరగతులకు పాఠాలు చెప్పే టీచ‌ర్స్ 19 నుంచి ప్రతి శుక్రవారం పాఠశాలకు హాజరు కావాలి. పదో తరగతి ఉపాధ్యాయులు ప్రతి బుధవారం, శుక్రవారం స్కూళ్ల‌కు వెళ్లాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎల్ఐసీ హెచ్చరిక.. మోసగాళ్ల నుంచి జాగ్రత్త..