పక్షి ఢీకొట్టడం వల్లే విమాన ప్రమాదమా? పైలెట్ నుంచి మే డే కాల్!

ఠాగూర్
గురువారం, 12 జూన్ 2025 (17:24 IST)
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ మహా విషాదం గురువారం మధ్యాహ్నం 1.43 గంటల సమయంలో జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, ఈ ప్రమాదానికి కారణం.. విమానాన్ని ఓ పక్షి ఢీకొనడం వల్లే జరిగివుంటుందని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 
 
ఈ ఘటనపై నిపుణులు స్పందిస్తూ, టేకాఫ్ సమయంలో విమానానికి పక్షి ఢీకొనివుండొచ్చని, దాని కారణంగానే విమానం టేకాఫ్‌కు అవసరమైన వేగాన్ని ఎత్తును అందుకోలేక ప్రమాదానికి దారితీసివుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. 
 
విమానరంగ నిపుణుడు, మాజీ సీనియర్ పైలెట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ స్పందిస్తూ, ప్రాథమికంగా చూస్తే ఇది కొన్ని పక్షుల ఢీకొన్న ఘటనలా కనిపిస్తోంది. దీనవల్ల రెండు ఇంజన్లు శక్తిని కోల్పోయి ఉండొచ్చు. టేకాఫ్ సజావుగానే జరిగింది. అయితే, గేర్లను పైకి తీసుకొచ్చే లోపే విమానం కిందికి దిగడం ప్రారంభించింది. ఇంజన్లు శక్తిని కోల్పోయినపుడు లేదా విమానం పైకి లేచే శక్తిని కోల్పోయినపుడు మాత్రమే ఇలా జరుగుతుంది. అసలు కారణం దర్యాప్తులో తేలుతుంది" అని అన్నారు. 
 
ఈ దృశ్యాలను చూస్తే టేకాఫ్ ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగినట్లుంది. విమానం నియంత్రిత పద్దతిలోనే కిందకు వచ్చింది. పైలెట్ మే డే కాల్ ఇచ్చారు. అంటే అది అత్యవర పరిస్థితి అని అర్థం అని నొక్కి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

Bandla Ganesh: రవితేజకి ఆల్టర్నేట్ జొన్నలగడ్డ సిద్దు: బండ్ల గణేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments