గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని ఎయిరిండియా విమానం ఓ వైద్య కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. అలాగే, మరికొందరు గాయపడినట్టు సమాచారం. అహ్మదాబాద్ నగరంలోని సర్దార్ వల్లాభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే ఈ విమానం కుప్పకూలిపోయింది.
విమానాశ్రయానికి సమీపంలోనే ఉన్న ఓ వైద్య కాలేజీ వసతి గృహం భవనంపై ఈ విమానం కూలిపోయింది. దీంతో హాస్టల్ భవనాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా, వంటగది పూర్తిగా దెబ్బతిన్నాయి. విమానం ప్రమాదానికి గురైన సమయంలో అందులో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఇద్దరు పైలెట్లు, పది మంది విమాన సిబ్బంది ఉన్నారు. కాగా, ఈ విమానంలో తన కుమార్తెను చూసేందుకు లండన్కు బయలుదేరిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్టు సమాచారం.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం : గుజరాత్ మాజీ సీఎం మృతి?
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందినట్టు తెలుస్తోంది. లండన్లో ఉన్న తన కుమార్తెను చూసేందుకు ఆయన అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లే ఎయిరిండియా విమానంలో బయలుదేరారు. ఈ విమానం విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్టు సమాచారం.
ఈ విమానంలో విజయం రూపానీ పేరుతో ఓ టికెట్ తొలుత నెట్టింట వైరల్ అయింది. ఇందులో బోర్డింగ్ సమయం మధ్యాహ్నం 12.10 గంటలుగా ఉంది. ఆ తర్వాత విమానం ఎక్కినట్టు నిర్ధారించే ప్రయాణికుల జాబితాలోనూ రూపానీ కనిపించింది. లండన్లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు విజయ్ రూపానీ ఈ విమానంలో ప్రయాణానికి బుక్ చేసుకున్నట్టు జాతీయ మీడియా కథనాల సమాచారం.