Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్‌జీ గేమ్‌తో పిచ్చెక్కిపోతున్న పిల్లలు... పెద్దలూ చూస్కోండి జాగ్రత్త

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (20:19 IST)
ఈ మధ్య కాలంలో పబ్‌జీ గేమ్‌తో చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ గేమ్ ఆడే పిల్లలు లేదా పెద్దల ప్రవర్తనల్లో మార్పులు రావడం, వారిలో హింసా ప్రవృత్తి పెరుగుతుండటంతో పాటు విద్యార్థుల చదువు కూడా నాశనం అవుతుండటంతో చాలా ప్రభుత్వాలు పబ్‌జీ, అలాంటి ఇతర గేమ్‌లను ఆడవద్దని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి.
 
తాజాగా గుజరాత్ అహ్మదాబాద్‌లో పబ్‌జీ గేమ్ ఆడిన పది మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రస్తుతం గుజరాత్‌లో పబ్‌జీ గేమ్‌ను పూర్తిగా నిషేధించారు. పోలీసులు వెళ్లినా కూడా పది మంది విద్యార్థులు వారిని పట్టించుకోకుండా ఉండటంతో పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసారు. అయితే అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపేసారు.
 
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల మంది ఫోన్‌లో పబ్‌జీ గేమ్ ఉన్నట్లు సమాచారం. ఈ గేమ్ ఆడే వారిలో హింస ప్రేరేపించబడుతోందని, వారిలో విపరీతమైన ప్రవర్తనకు దారి తీస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే భారతదేశంలో కేవలం గుజరాత్‌లో మాత్రమే ఈ గేమ్‌పై నిషేధం ఉండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments