Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అద్వానీకి ప్రతి నమస్కారం చేయలేని మోదీ.. ఇప్పుడేమో ఆయన కాళ్లు పట్టుకుని?

అద్వానీకి ప్రతి నమస్కారం చేయలేని మోదీ.. ఇప్పుడేమో ఆయన కాళ్లు పట్టుకుని?
, మంగళవారం, 5 మార్చి 2019 (15:33 IST)
బీజేపీ కురువృద్ధుడు, తన గురువు అయిన ఎల్‌కే అద్వానీకి ప్రధాని మోదీ ఏమాత్రం గౌరవ ఇవ్వరనే విషయం పలు సందర్భాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. త్రిపుర రాజధాని అగర్తలో శుక్రవారం కొత్త సీఎంగా బీజేపీ నేత విప్లవ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో మోదీ.. అద్వానీ నమస్కారానికి బదులివ్వలేదు. 
 
కనీసం ఆయనవైపు కన్నెత్తికూడా చూడలేదు. అయితే అద్వానీ పక్కనే ఉన్న సీపీఎం నేత, తాజీ మాజీ సీఎం మాణిక్ సర్కాను మోదీ పలకరించి చాలాసేపు మాట్లాడారు. మోదీ అమర్యాదకర తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు అప్పట్లో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా మోదీ.. గుజరాత్ కార్యక్రమంలో..  గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ పాదాలకు ఆయన నమస్కరించారు.
 
ప్రధాని మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌లో ఉన్న అన్నపూర్ణ మాత దేవాలయంలో ఓ కార్యక్రమానికి ఆయన హజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మోదీని కేశుభాయ్ ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఫ్జల్ గురు తనయుడు గాలిబ్ గురు భారత పౌరుడు కాదా?