జియోమికి చెందిన పోకో ఎఫ్-1 బ్రాండ్ సంస్థ తన స్మార్ట్ఫోన్పై ధరను తగ్గించినట్లు ప్రకటించింది. అవును.. గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన పోకో ఎఫ్-1 స్మార్ట్ ఫోన్ ధరను తగ్గించడం జరిగింది. దీని ధర రూ.20,999 నుంచి రూ.19,999 వరకు పలికింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్పై రెండు వేల రూపాయలను తగ్గిస్తున్నట్లు జియోమీ ప్రకటించింది.
ఈ తగ్గిన ధరతో పోకో ఎఫ్-1 రూ.17,999లకే వినియోగదారులకు అందుబాటులో వుంటుంది. జూన్ 9వ తేదీ వరకే ఈ తగ్గింపు ధరలో పోకో ఎఫ్-1 ఫోన్లు అందుబాటులో వుంటాయి. అలాగే 6జీబీ రామ్ 128 జీబీ మెమరీ వేరియంట్పై మాత్రమే ఈ తగ్గింపు ధర వర్తిస్తుందని జియోమీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఫోన్ను ఫ్లిప్ కార్ట్, ఎమ్ఐడాట్కామ్లలో పొందవచ్చు.